Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజీ మనీ కోసం ఏటీఎంలో డబ్బులు గుంజేసిన ఇద్దరు ఇంజినీర్ల అరెస్ట్

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (17:45 IST)
టెక్నాలజీ తెలుసుకుని ఈజీ మనీ కోసం ఏటీఎంలో డబ్బులు దొంగతనం చేస్తున్న ఇద్దరు ఇంజనీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారికి సహాకారం అందించిన మరో ఆరుగురు అనుమానితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగిలించిన డబ్బుతో వారు బంగారం, ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పింప్రి చిన్చ్వాడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఏటీఎం ట్యాంపరింగ్‌కు పాల్పడి డబ్బులు దొంగిలించిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు నిందితుల వద్ద నుంచి 66 లక్షల రపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందితును మనోజ్ సూర్యవంశీ, కిరణ్ భానుదాస్ కోల్టేగా గుర్తించారు. అందులో మనోజ్ గతంలో ఏటీఎం తయారీ కంపెనీలో పనిచేసేవాడు. ఇక, కిరణ్ మెకానికల్ ఇంజనీర్‌గా ఉన్నప్పటికీ.. ఏటీఎంలను పగులకొట్టడంలో దిట్టగా ఉన్నాడు.
 
నిందితులు దొంగతనానికి పాల్పడే సమయంలో ఏటీఎంలో సీసీటీవీ కెమెరాలను కవర్ చేసేవారు. అలాగే ఏటీఎం లాక్‌ను ట్యాంపరింగ్ చేయడం, ఏటీఎం పిన్స్ దొంగిలించడం, డూప్లికేట్ తాళాతో ఏటీఎంలను ఓపెన్ చేయడం.. ద్వారా వారు చోరీలకు పాల్పడేవారు. క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శంకర్ బాబర్, అతని బృందం ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనుమానితుల వద్ద నుంచి పోలీసులు రూ. 6 లక్షలు, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments