Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌లో చూసి అబార్షన్ చేసుకున్న మహిళ

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (08:11 IST)
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ అతి తెలివి ప్రదర్శించింది. యూట్యూబ్‌లో చూసి అబార్షన్ చేసుకుంది. అది వికటించడంతో ఇపుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ గర్భస్రావం చేసుకోవాలని నిర్ణయించింది. 
 
అయితే, ఆసుపత్రికి వెళ్లకుండా యూట్యూబ్‌లో గర్భస్రావానికి సంబంధించిన వీడియోలు చూస్తూ, అలాగే చేసింది. ఫలితంగా ఆమె ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుంది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
 
ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ షోయబ్ ఖాన్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2016 నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని వాపోయింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో యూట్యూబ్ వీడియోలు చూసి గర్భస్రావం చేసుకోవాలని షోయబ్ సూచించాడు. 
 
ఆమె అలాగే చేయడంతో వికటించి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఆమె ఫిర్యాదు నేపథ్యంలో షోయబ్‌ఖాన్‌పై అత్యాచారం సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments