Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటిని మానవహత్యలుగానే పరిగణించాలి : రతన్ టాటా

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (13:08 IST)
కేరళ రాష్ట్రంలో గర్భంతో ఉన్న ఓ ఏనుగుకు టపాకాయలు ఉన్న పైనాపిల్ తినిపించి చంపిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. దీన్ని జంతుహత్యగా కాకుండా మానవహత్యగా పరిగణించాలని ఆయన కోరారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
కేరళ రాష్ట్రంలోని మలప్పురంలో ఓ ఏనుగుకు టపాసులు ఉన్న పైనాపిల్ కాయ తినిపించి చంపేశారు. పైగా, ఈ ఏనుగు నిండు గర్భిణి. దీంతో ఏనుగుతో పాటు దాని కడుపులోని ఏనుగు పిల్ల కూడా చనిపోయింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. 
 
అలాగే, రతన్ టాటా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ట్విట్టర్ వేదికగా స్పందించారు. జంతువులపై జరుగుతున్న ఇటువంటి దారుణాలను మానవ హత్యలుగానే పరిగణించాలని ఆయన కోరారు. 
 
'కొందరు వ్యక్తులు పటాసులు నింపిన పైనాపిల్‌ ఆశపెట్టి అమాయకమైన ఓ ఏనుగును చంపిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురిచేసింది. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలకు, సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలి' అంటూ రతన్ టాటా తన పోస్టులో కోరారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments