Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (07:53 IST)
దేశ వ్యాప్తంగా బుధవారం వైద్య సేవలు స్తంభించనున్నాయి. నీట్ పీజీ కౌన్సెలింగ్ చేపట్టాలన్న ఏకైక డిమాండ్‌తో రెసిడెంట్ వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో భాగంగా మంగళవారం మౌలానా ఆజాద్ వైద్య ఆస్పత్రి, కాలేజీ నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బుధవారం దేశ వ్యాప్తంగా వైద్య సేవల బంద్‌కు రెసిడెంట్ వైద్యులు పిలుపునిచ్చారు. 
 
నిజానికి నీట్ పీజీ కౌన్సెలింగ్ చేపట్టాలన్న డిమాండ్‌తో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో రెసిడెంట్ వైద్యులు నెల రోజులుగా దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. కానీ, కేంద్రం ఏమాత్రం స్పందించ లేదు. మంగళవారం ఆజాద్ మెడికల్ ఆస్పత్రి నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీని తలపెట్టగా, పోలీసులు అడ్డుకుని భగ్నం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ కూడా చేశారు. 
 
దీన్ని పరిగణించిన రెసిడెంట్ వైద్యులు బుధవారం దేశ వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయాలని రెసిడెంట్ వైద్యులకు పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటల నుంచే విధులకు దూరంగా ఉండాలని కోరారు. మరోవైపు, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న రెసిడెంట్ వైద్యులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఫెడరేషన్ ఆప్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ మంగళవారాన్ని బ్లాక్ డే గా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments