కారులో వేరొక మహిళతో కులికిన రోహిత్.. ఒకే గ్లాసులో మద్యం.. అపూర్వ అందుకే?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (11:25 IST)
మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడిని ఆతని భార్యే హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో రోహిత్ శేఖర్ తివారీ భార్య ఎలా హతమార్చిందనే అంశంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో అపూర్వ ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదనుగా తీసుకుందని.. దిండును రోహిత్ ముక్కుపై అదిమి ఊపిరాడక చేసిందని చెప్పుకొచ్చారు. 
 
ఇంకా ఈ హత్యోదంతంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. దిండుతో నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి కేవలం రెండు నిమిషాల్లో అపూర్వ తన భర్తను చంపేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 15న రోహిత్‌ ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి కారులో వస్తుండగా డిన్నర్‌ రెడీ చేసేందుకు అపూర్వ భర్తకు వీడియో కాల్‌ చేసింది. ఆ సమయంలో కారులో మరో మహిళ ఉంది. రోహిత్ ఈ విషయాన్ని దాచేందుకు ప్రయత్నించాడు. కానీ గాజుల శబ్ధంతో పాటు సదరు మహిళ దుస్తులు అపూర్వకు కనిపించాయి. 
 
దీంతో శేఖర్ ఇంటికి చేరుకున్నాక కారులోని మహిళ గురించి నిలదీసింది. ఆమె, తాను ఒకే గ్లాసులో మద్యం సేవించినట్లు రోహిత్‌ బదులివ్వడంతో అపూర్వకు కోపం కట్టలు తెంచుకుంది. అంతే అపూర్వ భర్త మీద పడి గొంతు పట్టుకొని ఊపిరాడకుండా చేసి రెండే రెండు నిమిషాల్లో చంపేసింది. మద్యం మత్తు, బలహీనంగా ఉండడంతో రోహిత్‌ ప్రతిఘటించలేక కేవలం రెండు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments