Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50 కోట్లిస్తే ప్రధాని మోడీ చంపేస్తా : మాజీ సైనికుడు

Webdunia
మంగళవారం, 7 మే 2019 (13:43 IST)
తనకు ఎవరైనా రూ.50 కోట్లు ఇస్తే ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని భారత ఆర్మీకి చెందిన మాజీ సైనికుడు తేజ్ బహదూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఆయన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. ఆయనపై పలువురు పోటీ చేస్తున్నారు. దీంతో తేజ్‌ బహుదూర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసంపూర్తిగా నింపారని పేర్కొంటూ ఆయన నామినేషన్‌ను తోసిపుచ్చారు. 
 
ఈ నేపథ్యంలో ప్రధానిని హత్య చేస్తానంటూ బహదూర్‌ వ్యాఖ్యానించిన వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో రెండేళ్ల కిందటిదని సమాచారం. ఈ వీడియోలో ఉన్నది తానేనని తేజ్‌ బహదూర్‌ ఒప్పుకున్నారు. అయితే, ఈ వీడియో వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
 
మరోవైపు ఈ వీడియోపై బీజేపీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ హత్యకు మరోసారి కుట్ర జరగడం.. అది కూడా ఆయనపై పోటీకి నామినేషన్‌ వేసిన అభ్యర్థే కుట్ర పన్నడం దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు తెలిపారు. మోడీని ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి హింసా మార్గాలను ఎంచుకుంటున్నాయని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments