Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కిరణ్ బేడీకి లేదు : మద్రాస్ హైకోర్టు

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (16:34 IST)
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తేరుకోలేని షాకిచ్చింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం సాగిస్తున్న పాలనలో వేలెట్టరాదనీ, మంత్రివర్గాన్ని సంప్రదించకుండా ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
 
కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించింది. ఆమె ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం, సొంత నిర్ణయాలు తీసుకుని అమలు చేయడంసాగారు. దీంతో ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామికి ఆమెకు మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ముఖ్యంగా, ఆ రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లోని వైద్య సీట్ల భర్తీలో చేసుకున్న అవినీతి స్కామ్‌పై లోతుగా పరిశీలించారు. ఇలాంటి చర్యలను  పుదుచ్చేరి సర్కారు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయింది. 
 
అప్పటినుంచి కిరణ్ బేడీకి, పుదుచ్చేరి ప్రభుత్వానికి మధ్య అంతరం పెరిగిపోయింది. దీనిపై ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ పిటిషన్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ విచారణ జరిపింది. పాలనకు సంబంధించి కిరణ్ బేడీ సొంత నిర్ణయాలు తీసుకోరాదని, ఆమె ఇలాంటి విషయాల్లో ఎలాంటి అధికారాలు లేవని తేల్చి చెప్పింది. పుదుచ్చేరి క్యాబినెట్‌ను సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు మదురై బెంచ్ స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments