Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 సార్లు చేశాను... ఇక నా వల్ల కాదు...

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (18:52 IST)
భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? అభ్యర్థులను ఎంపిక చేయడం, ఖరారు చేయడం వంటి అంశాలలో తలమునకలై ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో కొంతమంది రాజకీయ కురువృద్ధులు సమాలోచనలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. అయితే తమ కుటుంబంలోని వారు మాత్రం పోటీలో నిలుస్తారని వెల్లడించారు. ఇప్పటికే తాను 14 సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసానని, విశ్రాంతి తీసుకునేందుకు ఇదే సరైన సమయంగా తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. 
 
కూతురు సుప్రియా సూలే, మనవడు పార్థ పవార్ లోక్‌సభ బరిలో దిగనున్నారని చెప్పాడు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ పవార్ పోటీ చేయలేదు. అయితే ఈసారి మాత్రం పోటీ చేస్తారని పార్టీనేతలు, కార్యకర్తలు భావించారు. తాజా నిర్ణయంతో తాను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments