Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గాంధీ తరహాలోనే మోదీ హత్యకు మావోల కుట్ర..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హతమార్చే ప్రయత్నాల్లో మావోయిస్టులు కుట్ర పన్నారట. నిషేధిక మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగివున్న ఐదుగురిని తాము బుధవారం అదుపులోకి తీసుకోగా.. వీరిలో ఒకరి నివాసం నుంచి ఓ లే

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (13:11 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హతమార్చే ప్రయత్నాల్లో మావోయిస్టులు కుట్ర పన్నారట. నిషేధిక మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగివున్న ఐదుగురిని తాము బుధవారం అదుపులోకి తీసుకోగా.. వీరిలో ఒకరి నివాసం నుంచి ఓ లేఖను సీజ్ చేశామని పుణే పోలీసులు స్థానిక సెషన్స్ కోర్టును నివేదిక ఇచ్చారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని హతమార్చిన తరహాలోనే మోదీని అంతమొందించే దిశగా మావోలు ఉన్నట్లు లేఖ ద్వారా తెలుస్తోంది. 
 
అరెస్టయిన ఐదుగురిలో ముంబైకి చెందిన సుధీర్ ధవావే, నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది సురేంద్ర గండ్లింగ్, షోమా సేన్, మహేష్ రావత్, ఢిల్లీకి చెందిన రోనా జాకబ్ వున్నారు. వీరికి సెషన్స్ కోర్టు 14వరకు పోలీసుల కస్టడీకి కోర్టు ఆదేశించింది. 
 
నిందితుల్లో ఒకరైన రోనా జాకబ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న లేఖలో ఎం-4 రైఫిల్ నాలుగు లక్షల రౌండ్లను కొనుగోలు చేసేందుకు దాదాపు ఎనిమిది కోట్లు అవసరమని పేర్కొనడం జరిగిందని.. రాజీవ్ గాంధీ తరహా హత్య కుట్ర ఇందులో వుందని చెప్పుకొచ్చారు. మోదీ హిందుత్వ పాలన చేస్తున్నారని.. ఇది గిరిజన వాసులపై ప్రభావం చూపుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments