Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాచెల్లెళ్లు.. అయినా ప్రేమించుకున్నారు.. చివరికి ఆత్మహత్యకు?

ఆధునికత ప్రభావంతో మానవీయ విలువలు పడిపోయాయి. వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. సోదరీసోదరుల మధ్య ప్రేమ, వివాహం ఏంటని.. పెద్దలు మందలించారు. అంతే ఆ ఇద్దరు ఆత్మహత్యకు

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (13:08 IST)
ఆధునికత ప్రభావంతో మానవీయ విలువలు పడిపోయాయి. వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. సోదరీసోదరుల మధ్య ప్రేమ, వివాహం ఏంటని.. పెద్దలు మందలించారు. అంతే ఆ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జీయపురం, కీళ కారియపట్టికి చెందిన అశోక్ కుమార్‌ కుమార్‌ ప్రవీణ్‌(17) ప్లస్‌ టూ చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమించాడు. వీరిద్దరూ ఒకే కులానికి చెందిన వారు.. పైగా వరుసకు అన్నాచెల్లెళ్లు. కానీ వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియరావడంతో ఇద్దరినీ మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు బుధవారం స్కూలుకు వెళ్ళి తిరిగొస్తూ... తిరుచ్చి రైల్వేస్టేషన్‌కు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.  తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేదని, చనిపోయి ప్రేమను కాపాడుకుంటామని సూసైడ్ నోట్‌లో రాసినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments