Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయనాడ్‌ బైపోల్.. ప్రియాంకకు మద్దతుగా సోనియా గాంధీ

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (12:40 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇందులో వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పేరును ప్రకటించారు. 
 
అదేసమయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పేరును ఖరారు చేశారు. ఈమె కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా విభాగం ప్రధాన కార్యదర్శిగా నవ్య కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప పోరుపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ తరపున కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తర్వాత రెండు మూడు దఫాలుగా సోనియా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సోనియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఏఐసీసీ ఖరారు చేయనుంది. 
 
మరోవైపు, బీజేపీ బరిలో నిలిపిన నవ్య హరిదాస్ ప్రస్తుతం కోజికోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నట్టు ఆమె సోషల్ మీడియా ఖాతాను పరిశీలించగా తెలుస్తుంది. పార్టీ డైనమిక్ లీడర్లలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. 2007లో బీటెక్ పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments