Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువుల అంత్యక్రియలపై కూడా నిషేధం ఉంటుందేమో : త్రిపుర గవర్నర్ సెటైర్

త్రిపుర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా, దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగను పురస్కరించుకుని పటాసులు అమ్మకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయంతెల్సింద

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (05:58 IST)
త్రిపుర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా, దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగను పురస్కరించుకుని పటాసులు అమ్మకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయంతెల్సిందే. ఈ నిషేధం నవంబరు ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటుంది. 
 
దీనిపై త్రిపుర గవర్నర్ తథాగథరాయ్ స్పందిస్తూ... పటాసులపై నిషేధం తర్వాత ఇక హిందువుల అంత్యక్రియలపై నిషేధం ఉంటుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అవార్డులు వెనక్కిస్తున్న వారు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించే వారు.. ఇక‌ హిందువుల అంత్యక్రియలపై నిషేధం విధించాలని కోర్టును ఆశ్ర‌యిస్తారేమోన‌ని ఆయ‌న వ్యంగ్యంగా అన్నారు. ఏడాదికి ఒక్కరోజు చేసుకునే దీపావళితోనే కాలుష్య స‌మ‌స్య వ‌స్తుందా? అంటూ ఆయన సందేహాన్ని లేవనెత్తారు. 
 
కాగా, రాజ్యాంగ పదవిలో ఉండే ఓ రాష్ట్ర గవర్నర్ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పలువురు ఆయనకు మద్దతు తెలుపుతుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నతో మాట్లాడినా లింకులు పెట్టేస్తున్నారు.. రెండో పెళ్లి అంటూ ట్రోల్ చేస్తున్నారు... జాను వీడియో

అనిరుధ్ సంగీతానికి అభిమాని అయిపోయా : విజయ్ దేవరకొండ

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments