Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల అదుపులో నేతాజీ సుభాష చంద్రబోస్ మనవరాలు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (11:50 IST)
భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవరాలు రాజ్యశ్రీ చౌదరి బోస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానవాపి మసీదులో ఆమె పూజలు చేసేందుకు వెళ్లడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రైలులో వారణాసికి బయలుదేరిన రాజ్యశ్రీని ప్రయాగ్‌రాజ్ వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, ఆమె అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. దీనిపై ఆమె గతవారం ఓ ప్రకటన చేశారు. జ్ఞానవాపి మసీదు వద్ద జలాభిషేకం చేస్తానని అందులో పేర్కొన్నారు. అయితే, దీనికి అనుమతి లేదని స్థానిక పోలీసులతో పాటు అధికారులు వెల్లడించారు. 
 
అయినప్పటికీ ఆమె ముందుగా ప్రకటించినట్టుగా మసీదులో జలాభిషేకం చేసేందుకు రైలులో బయలుదేరారు. దీన్ని తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని నిర్బంధించాయి. ప్రస్తుతం ఆమెను గృహనిర్బంధంలో ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments