Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ మసీదు కేసు ఏప్రిల్‌కు వాయిదా... బీజేపీ నేతలకు విముక్తి లభించేనా?

బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి భాజపా నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అందరినీ లిఖిత పూర్వకంగా నివేదికలు అందించాలని కోర్

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (17:22 IST)
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి భాజపా నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అందరినీ లిఖిత పూర్వకంగా నివేదికలు అందించాలని కోర్టు ఆదేశించింది. రెండు వారాల తర్వాత కేసు విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. 
 
1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి ఎల్కే. అద్వానీ, కేంద్ర మంత్రి ఉమాభారతి, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ, వినయ్ కతియార్ సహా 13 మంది భాజపా నేతలపై కుట్ర అభియోగాలను ప్రత్యేక కోర్టు కొట్టేసింది. కింది కోర్టు తీర్పును అలహాబాద్‌ హైకోర్టు సమర్థించింది. దీంతో సీబీఐ ఈ కేసును సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
 
అయితే, సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కేవలం సాంకేతిక కారణాలతో 13 మంది భాజపా నేతలపై ఉన్న కేసులు తొలగించేందుకు అంగీకరించబోమని, అవసరమైతే కుట్ర ఆరోపణలపై వారు తిరిగి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించింది. 
 
వాస్తవానికి ఈ కేసులో బుధవారమే కోర్టు తీర్పును వెలువరించాల్సి వుండగా, గురువారానికి వాయిదా వేసింది. అయితే, గురువారం మరోమారు విచారణకు రాగా రెండు వారాల పాటు వాయిదా వేయడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments