అనారోగ్యంగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎలా చేశారు?

ఠాగూర్
గురువారం, 30 మే 2024 (17:18 IST)
అనారోగ్యంగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎలా చేశారు అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మి పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురువారం రెగ్యులర్ బెయిల్  కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అలాగే, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను పొడగించాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాదనలు ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల వేళ విస్తృత ప్రచారం నిర్వహించకుండా ఆయన ఆరోగ్యమేమీ అడ్డంకిగా మారలేదని గుర్తు చేసింది. 
 
మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. 
 
జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్‌ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments