Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాతో స్నేహం చేస్తూనే నా భార్యనే ఉంచుకుంటావా?

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (08:32 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మాజీ కానిస్టేబుల్ తన స్నేహితుడుని కాల్చి చంపాడు. తనతో స్నేహం చేస్తూనే తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లా పాలషిపర పట్టణానికి చెందిన బిభాష్ మండల్, సుభాష్ బిశ్వాస్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణస్నేహితులు. వీరిలో బిభాష్ మండల్ సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. 
 
ఈ క్రమంలో బిభాష్ మండల్ భార్యతో సుభాష్ బిశ్వాస్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీన్ని గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బిభాష్ మండల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. 
 
అంతే.. తుపాకీ తీసుకొచ్చి ఓ దుకాణం వద్ద ఉన్న సుభాష్ బిశ్వాస్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడే ఆయన కుప్పకూలిపోయాడు. ఆ తర్వా బిభాస్ అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments