Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్న సినీనటి గౌతమి

సెల్వి
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (22:36 IST)
Gautami
బీజేపీని వీడిన సినీనటి గౌతమి ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. గౌతమి 1988లో రజనీకాంత్ నటించిన గురు శిష్యన్ సినిమాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసింది. తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ తదితర భాషల్లో నటిస్తూ 90వ దశకంలో దక్షిణ భారత నటీమణుల్లో ఒకరిగా వెలుగొందారు.
 
ఈ క్రమంలో గౌతమి 1997లో బీజేపీలో చేరి ఆ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి కోసం గౌతమి చేసిన ప్రచారాలు చాలామంది దృష్టిని ఆకర్షించాయి.
 
కుమార్తె పుట్టిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్న ఆమె 2017లో మళ్లీ బీజేపీలో చేరారు. 2021లో రాజపాళయం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. నటి గౌతమి గత అక్టోబర్‌లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
25 ఏళ్లుగా పార్టీకి విధేయురాలిగా ఉన్నా తనకు తగిన గుర్తింపు రాలేదని నటి గౌతమి ఆరోపించారు. ఈ నేపథ్యంలో నటి గౌతమి ఎడప్పాడి బుధవారం పళనిస్వామి సమక్షంలో ఏఐఏడీఎంకేలో చేరారు. చెన్నైలోని గ్రీన్‌వేస్‌ రోడ్‌లోని ఆయన  నివాసంలో ఎడప్పాడి పళనిస్వామిని కలిసిన తర్వాత నటి గౌతమి అన్నాడీఎంకేలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments