Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.37 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం

Webdunia
ఆదివారం, 14 మార్చి 2021 (11:45 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో వుంది. దీంతో నగలు, నగదు అక్రమంగా తరలించకుండా ఉండేందుకు వీలుగా ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సరైన ఆధారాలు లేకుండా ధ్రువీకరణ పత్రాలు లేకుండా రూ. 37.57 కోట్ల విలువైన 234 కేజీల బంగారాన్ని రోడ్డు మార్గంలో తరలిస్తుండగా తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. 
 
సేలం - చెన్నై జాతీయ రహదారిపై నిన్న ఉదయం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ బంగారం పట్టుబడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. తమిళనాడులో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడడం ప్రాధాన్యం సంతరించుకుంది.  
 
ఆభరణాల రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బంగారాన్ని తరలిస్తున్న మినీ లారీ డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగలను గంగవల్లి ట్రెజరీకి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments