Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ చదివే మరదలిపై అత్యాచారం.. గర్భస్రావానికి యత్నించడంతో...

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (20:49 IST)
పదో తరగతి చదివే మరదలిపై అత్యాచారం ఓ ప్రబుద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆయన ఏళ్ళ తరబడి ఈ పాడుపని చేస్తూ వచ్చాడు. చివరకు ఆ బాలిక గర్భందాల్చింది. దీంతో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కరుత్తన్‌గోడుకు చెందిన అయ్యప్పన్ (30) అనే వ్యక్తి స్థానికంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా ఉంటున్నారు. ఈయన ఐదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు. 
 
అయితే, పదో తరగతి చదువుతున్న భార్య చెల్లెలిపై కన్నేసిన అయ్యప్పన్ ఆమెను మాయమాటలతో లోబరుచుకున్నాడు. ఆమెపై కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో అబార్షన్ చేయించేందుకు ఇటీవల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు అనుమానించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగుచూసింది. 
 
దీంతో అయ్యప్పన్ ఆ బాలికను ఆస్పత్రిలోనే వదిలిపెట్టి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడకు వచ్చి బాలికను విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అయ్యప్పన్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments