ప్రేమను అంగీకరించని టీచర్.. క్లాస్ రూమ్‌లో కత్తితో పొడిచిన యువకుడు

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (15:28 IST)
తమిళనాడు, తంజావూరులో తన ప్రేమను అంగీకరించని కారణంగా మహిళా టీచర్‌ను కత్తితో పొడిచి చంపేశాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళితే.. తంజావూరు, మల్లిపట్నం ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్తున్న టీచర్ రమణిని కత్తితో పొడిచి హత్య చేసాడు. 
 
తన ప్రేమను టీచర్ అంగీకరించకపోవడంతో స్టూడెంట్ మదన్ కుమార్ హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న మదన్‌ను పోలీసులు గాలిస్తున్నారు.
 
రెండ్రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మధన్, అతని కుటుంబ సభ్యులు ఇద్దరికీ పెళ్లి చేయాలని కోరుతూ రమణి ఇంటికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి పెళ్లి ప్రతిపాదనను రమణి తిరస్కరించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.
 
మధన్ ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. కాని రమణి అతనిని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు రమణిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయురాలి దారుణ హత్య తర్వాత తంజావూరు జిల్లా యంత్రాంగం పాఠశాలకు ఒక రోజు సెలవు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments