Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రైతుకు దుబాయ్‌లో లాటరీ తగిలింది.. కోటీశ్వరుడయ్యాడు.. ఎలా?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (15:36 IST)
భార్యను బతిమాలి లాటరీ కొన్నాడు. అంతే కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ రైతు లాటరీతో కోటీశ్వరుడు కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రిక్కల విలాస్.. కొన్నాళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ రెండేళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేశాడు. 
 
అయితే ఆ తర్వాత మరో ఉద్యోగం కోసం వెతికాడు కానీ ఉద్యోగం దొరకలేదు. దీంతో చేసేది లేక భారత్‌కు వచ్చేశాడు. అయితే, యూఏఈలో ఉన్నప్పుడు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది అతనికి. 
 
సొంతూరికి వచ్చిన తర్వాత కూడా లాటరీ టికెట్ల మీద మనసు చావలేదు. దీంతో భార్యను బతిమాలి ఆమె దగ్గర రూ.20వేలు తీసుకున్నాడు. ఆ డబ్బును దుబాయ్‌లో ఉన్న తన స్నేహితుడికి పంపించాడు. అలా లాటరీ టిక్కెట్లు కొనేలా చేశాడు.
 
అయితే ఆ లాటరీ ద్వారానే ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఆ లాటరీ టికెట్‌కే కోట్లు తగిలాయి. తన భార్య వల్లే ఈ లాటరీ వచ్చిందని విలాస్ చెప్పాడు. దుబాయ్‌లో కొన్న ఓ లాటరీ టికెట్‌కు సుమారు రూ.29 కోట్ల నగదు బహుమతి లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments