Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేశాడు.. ఇల్లును రాయించుకున్నాడు : తెలంగాణ మహిళ ఫిర్యాదు

ఢిల్లీలో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ మోసపోయింది. అత్యాచారానికి గురికావడమేకాకుండా, ఆస్తి కూడా పోగొట్టుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (15:47 IST)
ఢిల్లీలో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ మోసపోయింది. అత్యాచారానికి గురికావడమేకాకుండా, ఆస్తి కూడా పోగొట్టుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో సుభాష్ అనే యువకుడు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆ ఎస్టేట్‌లో తెలంగాణాకు చెందిన మహిళ పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమెకు సుభాష్ మాయమాటలు చెప్పి లోబర్చుకుని తన కోర్కె తీర్చుకున్నాడు. ఆ తర్వాత 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆమె ఇంటిని కూడా రాయించుకున్నాడు. 
 
డబ్బులొస్తాయని ఆశగా ఎదురు చూసిన ఆమె నిలదీయడంతో అతను చేసిన మోసం వెలుగుచూసింది. దీంతో ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వారిని వేడుకుంది. తనపై నాలుగు సార్లు అత్యాచారం చేసి, తన ఆస్తి రాయించుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments