Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అతి తక్కువ జీతం తీసుకోనున్న ఢిల్లీ ఎమ్మెల్యేలు, నెలకి రూ. 30,000

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (22:40 IST)
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ కేబినెట్ కేంద్రం ప్రతిపాదించిన విధంగా ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాల పెంపును ఆమోదించింది. ఢిల్లీ ఎమ్మెల్యేలకు దేశంలోనే అత్యల్పం అంటే... మొన్నటివరకూ రూ. 12,000 చెల్లించారు. కొత్తగా ఆమోదించిన ప్రకారం ఇకపై రూ. 30,000 చెల్లిస్తారు.
 
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను తాజాగా ఆమోదించింది. ఆ ప్రకారం ఇకపై ఎమ్మెల్యేలకి 30 వేల జీతంతో పాటు ఇతర అలవెన్సులు కలుపుకుని రూ. 90 వేల వరకూ వస్తుంది.
 
కాగా 2011 నుండి ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం పెరగలేదు. ఢిల్లీ ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తూనే వున్నది. ఇతర రాష్ట్రాల MLA లతో సమానంగా ఉండాలని కోరింది. 
 
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాభత్యాలు చివరిగా 2011లో పెంచబడ్డాయి. ఢిల్లీలో జీవన వ్యయం గణనీయంగా పెరిగినప్పటికీ గత 10 సంవత్సరాలలో ఎటువంటి పెరుగుదల లేదు. 
 
ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎమ్మెల్యేలకు ఇవ్వాలని కోరింది. ఎట్టకేలకు రూ. 90 వేలకు ఆమోదం తెలపడంతో కేజ్రీవాల్ కేబినెట్ ఆమోదించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments