Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్ అసెంబ్లీ గెలుపు కోసం టీఎంసీ రూ.150 కోట్లు ఖర్చు!

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (17:13 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయభేరీ మోగించారు. అయితే, ఈ యేడాది ఆరంభంలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ పార్టీ ఏకంగా రూ.150 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు ప్రచారం సాగుతోంది. 
 
మరో వైపు తమిళనాడులో అన్నాడీఎంకేను ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న డీఎంకే పార్టీ.. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికలతో కలిసి రూ.114.14కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఈ మేరకు ఆయా పార్టీల ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాలను పోల్ ప్యానెల్ పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది.
 
గత అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ పుదుచ్చేరితో కలిపి ప్రచారం కోసం రూ.57.33 కోట్లు ఖర్చు వ్యయం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ల్లో ఎన్నికల్లో రూ.84.93 కోట్లు వెచ్చించింది. 
 
నాలుగు రాష్ట్రాలు, యూటీలో సీపీఐ కనీసం రూ.13.19కోట్లు ఖర్చు చేసింది. తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్ గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు కాగా.. డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రాంతీయ పార్టీలు. అయితే, బీజేపీకి సంబంధించిన ఖర్చుల వివరాలు అందుబాటులో లేవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments