Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో మహిళ పర్సను చోరీ చేసిన దొంగ... పట్టుకుని కిటికీకి వేలడాదీసిన ప్రయాణికులు

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (12:30 IST)
సాధారణంగా రద్దీగా ఉండే బస్సులు, రైళ్లలో జైబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల చేతికి చిక్కి దెబ్బలు తింటుంటారు. తాజాగా ఓ దొంగ రైలు ప్రయాణికురాలి వద్ద పర్సు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని రైలు కిటికీకి వేలడాదీశాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దొంగకు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
బిహార్ రాష్ట్రంలోని బెగూసరాయ్‌ జిల్లా పరిధిలో శనివారం కటిహార్‌ నుంచి సమస్తిపుర్‌ వెళ్తున్న రైలులో ఓ మహిళ పర్సు చోరీకి గురైంది. కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ దూకేందుకు ప్రయత్నిస్తున్న దొంగను మిగతా ప్రయాణికులు గుర్తించారు. వెంటనే లోపలి నుంచి ఆ యువకుడి చేతులు గట్టిగా పట్టుకున్నారు. కొన్ని కిలోమీటర్లు అలాగే వేలాడుతూ ప్రయాణించాక.. బచ్వారా జంక్షనులో రైలు ఆగింది. 
 
ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు అతణ్ని అప్పగించారు. రైలు కిటికీకి దొంగ వేలాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక విధంగా ఆ దొంగ ప్రాణాలను రైలు ప్రయాణికులు కాపాడారు. లేదంటే వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకివుంటే ఆ దొంగ ప్రాణాలు కోల్పోయేవాడని ప్రయాణికులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments