నవంబర్‌ 16 నుంచి శబరిమల దర్శనం.. కానీ పంబానదిలో స్నానాల్లేవ్!

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (10:34 IST)
కరోనా కారణంగా మూతపడిన సుప్రసిద్ధ క్షేత్రం శబరి మల మళ్లీ తెరుచుకోనుంది. ఈ క్రమంలో నవంబర్‌ 16వ తేదీ నుంచి శబరిమలయాత్ర ప్రారంభం కానుంది. అయితే శబరిమలకు వచ్చే భక్తులు కరోనా నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. వర్చువల్‌ క్యూ విధానం ద్వారా పేర్లు రిజిస్టర్‌ చేసుకున్న వారికే ఆలయంలోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
 
అయ్యప్పస్వామి దర్శనం అనంతరం భక్తులు వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో ఉండేందుకు అవకాశం ఇవ్వబోమని, పంబానదిలో పుణ్యస్నానాలకు అనుమతి కూడా ఉండదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
కాగా కేరళలోని శబరిమల ఆలయం నవంబర్ 16న మండల, మకర జ్యోతి దీక్ష చేసే యాత్రికుల కోసం తెరవబడుతుంది. ప్రతి శీతాకాలంలో రెండు నెలల మండలం- మకర జ్యోతి దర్శనాల సీజన్‌లో లక్షలాదిగా అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకోవటానికి వస్తారు. శబరిమల ఆలయాన్ని ప్రతి ఏటా 30 లక్షల మంది యాత్రికులు సందర్శిస్తారు. అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా శబరిమల ఆలయం మూత పడింది. 
 
ప్రస్తుతం తెరుచుకోనున్న శబరిమలలో కోవిడ్ -19 ప్రోటోకాల్‌లు పాటించబడతాయని, భక్తుల సంఖ్య కూడా ఉంటుంది పరిమితం చేయబడుతుంది. భక్తులందరూ తీర్థయాత్ర చేపట్టే ముందు కోవిడ్-నెగటివ్ సర్టిఫికెట్లు సమర్పించడం తప్పనిసరి. దర్శనానికి వచ్చే భక్తులందరికీ స్క్రీనింగ్ చేస్తామని, వారికి కావలసిన మార్కులు శానిటైజర్ లను అందిస్తామని కరోనా వ్యాప్తి జరగకుండా దేవాదాయ శాఖ నుండి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

రోషన్, అనస్వర రాజన్.. ఛాంపియన్ నుంచి గిర గిర గింగిరాగిరే సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments