Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగేయం స్థానానికి 1000 మంది రైతుల నామినేషన్ల దాఖలు

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (15:59 IST)
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 1000 మంది రైతులు కంగేయం స్థానానికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. పరంబికుళం-అల్లియర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌ను నాయకులు పట్టించుకోకపోవడంతో రైతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇదే విషయంపై ఐదు రోజులు నిరాహార దీక్షలు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఇచ్చిన హామీతో రైతులు నిరాహార దీక్షను ముగించారు. 
 
సీఎం హామీ.. హామీగానే మిగిలిపోయిందని తమ డిమాండ్లు నెరవేరలేదని రైతులు అంటున్నారు. అందుకే ఎన్నికల వేళ రైతు కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి రైతులు చెబుతున్నారు. కమిటీ సభ్యులు మంగళవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే 20కి పైగా నామినేషన్లు వేసినట్లు కమిటీ వర్గాలు తెలిపాయి.
 
ఈరోడ్ జిల్లాలోని మోడకురుచి అసెంబ్లీ సీటుపై రైతులు 25 సంవత్సరాల క్రితం ఇదే పనిచేశారు. 1996లో, 1,016 మంది రైతులు నామినేషన్ వేశారు, మొత్తం 1.033 మంది అభ్యర్థులు అప్పట్లో పోటీలో ఉన్నారు. ఇది ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. చివరికి అక్కడ ఎన్నికలు ఒక నెల వాయిదా పడాల్సి వచ్చింది. 50 పేజీల బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించారు. నిజామాబాద్‌లో కూడా పసుపు రైతులు 158మంది పార్లమెంట్‌కు పోటీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments