Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానవాటిక కాంప్లెక్స్ పైకప్పుకూలి 18 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 3 జనవరి 2021 (17:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజియాబాద్‌ మురాద్‌నగర్‌లో శ్మశానవాటిక కాంప్లెక్స్‌ పైకప్పు కూలింది. ఈ ఘటనలో 18 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు శిథిలాలకింద చిక్కుకున్నారు. వీరిని స్థానికులు ప్రాణాలతో రక్షించారు. 
 
ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించి సమీప దవాఖానలకు తరలించారు. భారీ వర్షం కారణంగా భవనం పిల్లర్‌ ఒక్కసారిగా కూలడంతో పైకప్పు కుప్పకూలి ప్రమాదం జరిగింది.
 
ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఘజియాబాద్‌ జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీని ఆదేశించారు. 
 
మృతుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాద జరిగిన సమయంలో శ్మశానవాటిక కాంప్లెక్స్‌ కింద 40 మందిపైగా ఉన్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments