Webdunia - Bharat's app for daily news and videos

Install App

కటిక పేదరికం భరించలేక.. ముగ్గురు అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య!

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (17:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాన్‌పూర్ బద్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కటిక పేదరికం భరించలేక ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి  చెందిన 16, 14, 11 యేళ్ళ వయస్సున్న అక్కా చెల్లెళ్లకు గణేష్ అనే సోదరుడు ఉన్నాడు. 
 
వీరి తండ్రి తొమ్మిదేళ్ళ క్రితం మరణించాడు. తల్లి జీవించివుండగా, ఆమెకు మూడేళ్ళ క్రితం కంటి చూపు పోయింది. దీంతో ఆ నలుగురు పిల్లలు దొరికిన పనల్లా చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో గురువారం రాత్రి ఫట్టుపూర్ దగ్గర సుల్తాన్ పూర్ రైల్వే క్రాసింగ్ జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి వారు ఆత్మహత్య చేసుకున్నారు. కటిక పేదరికాన్ని భరించలేక వీరంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. 
 
గురువారం సాయంత్రం ఇంటి నుంచి కలిసివెళ్లిన ముగ్గురు ఆడపిల్లలు రాత్రి 11 గంటలకు ఫట్టుపూర్ వద్ద విగతజీవులుగా మారారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments