Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు ఆరో దశ పోలింగ్

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (08:08 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఆరో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో 10 జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగతుంది. గోరఖ్‌పూర్‌తో సహా పది జిల్లాల్లో 57 నియోజకవర్గాలకు మార్చి 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు వీలుగా పోలింగ్ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అజయ్ కుమార్ శుక్లా వెల్లడించారు. 
 
ఈ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేసినట్టు ఆయన తెలిపారు. ఈ దశలో మొత్తం 2.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
కాగా, గత 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 57 సీట్లలో బీజేపీకి, దాని మిత్రపక్షాలైన ఆప్నాదళ్ ఎస్, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలు ఏకంగా 46 సీట్లను గెలుచుకున్నాయి. ఈ మొత్తం సీట్లలో 11 సీట్లు రిజర్వుడ్ స్థానాలు. చివరి దశ పోలింగ్ మార్చి 7వ తేదీన జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments