Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్సిల్ షేవింగ్స్ గొంతులో ఇరుక్కుని ఆరేళ్ళ చిన్నారి మృతి

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (19:02 IST)
పెన్సిల్ షేవింగ్స్ గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ రాష్ట్రంలోని హమీర్ పూర్ కొత్వాలి ప్రాంతంలో పహాడీ వీర్ గ్రామంలో నందకిషోర్ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం కుమారుడు అభిషేక్ (12), కుమార్తె అన్షిక (8), ఆర్తిక (6)లు ఇంటి మిద్దెపై కూర్చుని చదువుకుంటున్నారు. అయితే, ఒకటో తరగతి చదవుతున్న ఆర్తిక హోం వర్క్ చేసేందుకు తన నోటిలో షార్ప్‌నర్ పెట్టుకుని పెన్సిల్ తిప్పంది. 
 
ఈ క్రమంలో షార్ప్‌నర్ నుంచి వచ్చిన పెన్సిల్ షేవింగ్స్ ఆ బాలిక నోటిలోకి వెళ్లింది. దీంతో ఆ బాలికకు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయింది. ఈ విషయాన్ని అన్షిక్, అభిషేక్‌లు కింద వున్న తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆర్తిక మరణంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments