Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ళ బాలికను చంపి తినేసిన వీధి కుక్కలు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలికలకు, యువతులకు కామాంధుల నుంచే కాదు.. వీధి కుక్కల నుంచి రక్షణ లేకుండా పోయింది. రెండేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు చంపి తినడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదే

Webdunia
బుధవారం, 30 మే 2018 (14:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలికలకు, యువతులకు కామాంధుల నుంచే కాదు.. వీధి కుక్కల నుంచి రక్షణ లేకుండా పోయింది. రెండేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు చంపి తినడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోదీనగర్ మున్సిపాలిటీలోని భీంనగర్‌లో వెలుగుచూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన విషయాలను పరిశీలిస్తే..
 
భీంనగర్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉన్నది. ఆ సమయంలో వీధి కుక్కల మంద ఇంట్లోకి ప్రవేశించి.. ఒంటరిగా ఉన్న చిన్నారిపై దాడి చేశాయి. పిమ్మట చిన్నారిని నోటకరచుకుని సమీపంలోని చెరకు తోటలోకి తీసుకెళ్లి తినేశాయి. ఈ విషయాన్ని మోదీనరగ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పవన్ అగర్వాల్ వెల్లడించారు.
 
ఈ ఘటన అనంతరం కోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు మోదీనగర్ మున్సిపాలిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీధికుక్కలు బాలికను చంపి తిన్న ఘటన నేపథ్యంలో వాటిని పట్టుకోవాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో మున్సిపల్ అధికారులు వీధికుక్కల నివారణకు శ్రీకారం చుట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments