Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరుగుతున్న నూనెను కస్టమర్లపై పోశాడు (video)

రోడ్డు పక్కనే వున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ బాగోలేదని.. వాసన వస్తుందని ఆ షాపు వంటమనిషిని ప్రశ్నించిన యువకులకు చేదు అనుభవం ఎదురైంది. ఆహారం బాగోలేదని చెప్పిన పాపానికి మరుగుతున్న నూనెను జగ్గులోకి తీసుక

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (11:26 IST)
రోడ్డు పక్కనే వున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ బాగోలేదని.. వాసన వస్తుందని ఆ షాపు వంటమనిషిని ప్రశ్నించిన యువకులకు చేదు అనుభవం ఎదురైంది. ఆహారం బాగోలేదని చెప్పిన పాపానికి మరుగుతున్న నూనెను జగ్గులోకి తీసుకుని మరీ వారిపై పోశాడు వంటమనిషి. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబై మహానగరం థానే ఏరియాలోని ఉల్సాస్ పూర్ ప్రాంతంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇద్దరు యువకులు ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే క్వాలిటీ బాగోలేదని.. వాసన వస్తుందని.. ఫుడ్ సెంటర్‌లో తయారీ దారుడిని ప్రశ్నించారు. దీనిపై అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఇద్దరు కస్టమర్లు ఈ ఫుడ్‌ను అతనిపై విసిరేశారు. దీంతో వంటమనిషిని కోపం తలకెక్కింది. పరిగెత్తిన వారిని పట్టుకోవాలనుకున్నాడు. వాళ్లు చిక్కకపోవడంతో మరుగుతున్న నూనెను జగ్గులోకి తీసుకుని వాళ్లపై చల్లాడు. ఈ ఘటనలో యువకులిద్దరిపై కాకుండా.. మిగిలిన కస్టమర్లపై కూడా నూనెపడి గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిగే నూనెను పోసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
 
మరోవైపు గుజ‌రాత్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యే క‌రంసీ ప‌టేల్ కుమారుడు కాను ప‌టేల్ ఓవరాక్షన్ చేశాడు. అహ్మ‌దాబాద్‌కి 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉండే జంబుతా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తన పెట్రోల్ బంకులో రూ.6 ల‌క్ష‌లు మాయమయ్యాయని ఆరోపిస్తూ, వేడి వేడి నూనెలో 10 మంది ఉద్యోగులను చేతులు పెట్టమన్నాడు. అలా చేస్తే చోరీ ఎవ‌రు చేశారో తనకు తెలుస్తుంద‌ని న‌మ్మాడు. అతని ఆదేశానికి తలొగ్గిన ఉద్యోగులు అతను చెప్పిన ప్రకారం చొక్కాలు విప్పేసి, వరుసగా నిలబడి వేడి నూనెలో చేతులు పెట్టారు. చివరికి చేతులు కాల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments