Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించి స్కూలుకు వచ్చిన టీచర్‌పై చెప్పులు విసిరిన విద్యార్థులు!

వరుణ్
బుధవారం, 27 మార్చి 2024 (09:08 IST)
స్కూలుకు మద్యం సేవించి వచ్చిన ఉపాధ్యాయుడిపై కొందరు విద్యార్థులు చెప్పులు విసిరారు. అతనిపై చెప్పులు విసురుతూ పాఠశాల ఆవరణం నుంచి బయటకు తరిమేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే ఓ టీచర్... ప్రతి రోజూ పాఠశాలకు మద్యం సేవించి వచ్చేవాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండ వారిని తిట్టడం ప్రారంభించాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థులు చెప్పులు విసిరారు. విద్యార్థుల దాడిని తట్టుకోలేక టీచర్ అక్కడి నుంచి పారిపోయాడు. 
 
కాగా, ఈ టీచర్ తరచూ స్కూలుకు తాగి వచ్చేవాడని విద్యార్థులు తెలిపారు. పాఠాలు చెప్పడం మానేసి తరగతి గదిలోనే ఓ మూల చాప వేసుకుని నిద్రపోయేవాడని అన్నారు. తమకు పాఠాలు చెప్పాలని పలుమార్లు వేడుకున్నా ఏమాత్రం పట్టించుకునేవాడు కాదని వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన విద్యార్థులు టీచర్‌కు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments