Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్‌పై పడిన చిన్నారి... దూసుకెళ్లిన రైలు.. (Video)

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (09:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర రైల్వే స్టేషన్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఒక యేడాది వయసున్న చిన్నారి ట్రాక్‌పై పడిపోయింది. అంతలోనే ఆ చిన్నారి పైనుంచి ఓ రైలు దూసుకెళ్లింది. అయినప్పటికీ ఆ పాప చిన్నపాటి గాయంకూడా లేకుండా ప్రాణాలతో బయటపడింది. దీనితాలుకూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ జంట తమ ఏడాది వయసున్న చిన్నారితో మధుర రైల్వే స్టేషన్ ఒకటో నంబరు ఫ్లాట్‌ఫామ్‌పై రైలు కోసం వేచివున్నారు. పాప చేతిని తల్లి పట్టుకునివుంది. ఇంతలో వెనుక నుంచి ఆ మహిళను ఎవరో తగిలారు. దీంతో చేతిలోనుంచి పాప జారి రైలు పట్టాలకు ఫ్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న గ్యాప్‌లో పడిపోయింది. 
 
చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన సమయంలోనే ఓ రైలు వైగంగా పాప పడిన ట్రాక్‌పైనే దూసుకెళ్లింది. అంతే.. ఒక్క క్షణం ప్రతి ఒక్కరూ అయ్యో అంటూ బిగ్గరగా కేకలు పెట్టారు. పాప ఇక లేరని అంతా టెన్షన్ పడిపోయారు. కానీ, రైలు వెళ్లిపోయిన అనంతరం ఆ పాప బిగ్గరకా ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఓ వ్యక్తి పట్టాలపైకి దూకి చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆ చిన్నారికి చిన్నపాటి గాయం కూడా లేకుండా బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారంతూ ఊపిరిపీల్చుకున్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments