Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్ణీత సమయానికి ముందుగానే వచ్చిన రైలు.. డ్యాన్స్ చేసిన ప్రయాణికులు

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (13:33 IST)
సాధారణంగా దేశంలో నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తాయనే ప్రచారం ఉంది. "నేను ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు" అని ప్రముఖ సినీ కవి ఆరుద్ర అన్నారు కూడా. అనేక సందర్భాల్లో భారతీయ రైళ్ళ రాకపోకలను చూస్తే ఇది నిజమేనని నిరూపితమైన సంఘటనలు అనేక ఉన్నాయి. అయితే, ఇపుడు పరిస్థితులు మారిపోయాయి. నిర్ణీత సమయం లేదా దానికంటే ముందుగానే రైళ్లు స్టేషన్లకు వచ్చి ఆగుతున్నాయి. 
 
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లాం రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి ఓ రైలు నిర్ణీత సమయానికంటే 20 నిమిషాలు ముందుగా వచ్చి ఆగింది. బాంద్రా - హరిద్వార్ రైలు రాత్రి 10.35 గంటలకు స్టేషన్‌కు వచ్చి 10 నిమిషాలు ఆగుతుంది. కానీ, బుధవారం రాత్రి ఈ రైలు ఏకంగా 20 నిమిషాలు ముందుగానే స్టేషన్‌కు వచ్చి ఆగింది. 
 
దీంతో ప్రయాణికులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులయ్యారు. స్టేషన్‌లో 30 నిమిషాల పాటు రైలు ఆగడంతో ప్రయాణికులంతా రైలు దిగి ఆ రాష్ట్ర సంప్రదాయ గర్భా నృత్యంతో ఆలరించారు. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments