Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుతో కలిసివున్న భార్య.. కళ్లారా చూసిన భర్త సూసైడ్

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (19:08 IST)
తన భార్య మరో వ్యక్తితో కలిసివుండటాన్ని కట్టుకున్న భర్త కళ్లారా చూశాడు. తన భార్య పరాయి వ్యక్తితో శారీరకంగా కలిసివుండటాన్ని జీర్ణించుకోలేని ఆ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లా రొళ్ళ వడ్రహట్టి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి హనుమంత రాయప్ప కుమారుడు పీజీ.నాగరాజు (28)కు అదేగ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహమైంది యేడాది వరకు దాంపత్య జీవనం సాఫీగా సాగింది. 
 
అనంతరం అదే గ్రామానికి చెందిన హెచ్‌.నాగరాజు అలియాస్‌ బిల్లాతో మృతుడి భార్య సన్నిహితంగా ఉంటుండేది. క్రమేపి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. గత గురువారం మృతుడి భార్య ప్రియుడు హెచ్‌.నాగరాజుతో కలిసి ఉండటాన్ని గమనించిన భర్త పీజీ.నాగరాజు భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 
 
అప్పటినుంచి రెండు, మూడు రోజులుగా ఆచూకీ లేకపోయింది. ఇందిరమ్మ కాలనీ సమీపంలో చెట్టు కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడి తండ్రి హనుమం తరాయప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments