Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే నగర్ ఎన్నికల్లో విశాల్ పోటీ చేస్తే తప్పేముంది?: శరత్ కుమార్ మద్దతు

నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా సీనియర్ నటుడు శరత్ కుమార్, విశాల్ నువ్వా నేనా అన్నట్లు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శరత్ కుమార్ విశాల్‌ను వెనకేసుకుని వచ్చారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో విశాల్ పో

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (11:59 IST)
నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా సీనియర్ నటుడు శరత్ కుమార్, విశాల్ నువ్వా నేనా అన్నట్లు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శరత్ కుమార్ విశాల్‌ను వెనకేసుకుని వచ్చారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో విశాల్ పోటీ చేయడంలో తప్పేముందని అడిగారు. కానీ విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ఎంజీఆర్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైన సందర్భాలున్నాయని శరత్ కుమార్ వ్యాఖ్యానించారు. 
 
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ తిరస్కరించడం పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఎస్‌కే పేరుతో రూపొందించిన యాప్‌ను మంగళవారం చెన్నైలో శరత్ కుమార్ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమయ్యేందుకే ఈ యాప్‌ను రూపొందించినట్టు తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, విశాల్ పోటీ చేయడంలో తప్పేమీలేదన్నారు. 
 
నటీనటుల సంఘంలో ఐక్యత లోపించిందన్న శరత్ కుమార్, సమస్యల పరిష్కారానికి అందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా విశాల్‌ అంటేనే కారం మిరియాలు నూరే శరత్ కుమార్... విశాల్‌కు మద్దతు ప్రకటించడంపై కోలీవుడ్‌లో పెద్ద చర్చే సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments