Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీతో పాటు ఆరేళ్ళ కుమార్తెపై అత్యాచారం.... ఎక్కడ?

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (17:44 IST)
దేశంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతుంది. బహిరంగ ప్రదేశాల్లోనేకాకుండా, తమ గృహాల్లో కూడా వారికి రక్షణ కరువైంది. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌ సమీపంలోని రూర్కీలో ఓ మహిళతో పాటు ఆమె కుమార్తెపై అత్యాచారం జరిగింది. ఇక్కడ కూడా హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ తరహాలోనే కారులో అత్యాచార దారుణానికి ఒడిగట్టారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, రూర్కీకి చెందిన ఓ మహిళ తన ఆరేళ్ళ కుమార్తెను తీసుకుని రాత్రివేళ పిరాన్ కిలియార్ నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ కారు డ్రైవర్ సోను కాపు ఆపివారికి లిఫ్టు ఇచ్చాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత వారి స్నేహితులు కూడా కారు ఎక్కారు.
 
ఆ తర్వాత మహిళతో పాటు ఆరేళ్ళ చిన్నారిపై ఆ కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం తర్వాత తల్లీకుమార్తెలను దుండగులు కారు వద్ద పడేశారు. ఆ తర్వాత బాధిత మహిళ అర్థరాత్రి సమయంలో సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటన గురించి వివరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments