Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి పుడుతుందనుకుంటే.. అబ్బాయి పుట్టాడు.. అంతే చంపేసింది..?

ఆడ శిశువుల భ్రూణ హత్యల గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ పూర్తి భిన్నం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కుమార్తెను కోరుకున్న ఓ తల్లి, తనకు పుట్టిన కుమారుడిని దారుణంగా హతమార్చింది. ఆపై కుమారుడు కనిపించలేదని

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (09:36 IST)
ఆడ శిశువుల భ్రూణ హత్యల గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ పూర్తి భిన్నం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కుమార్తెను కోరుకున్న ఓ తల్లి, తనకు పుట్టిన కుమారుడిని దారుణంగా హతమార్చింది. ఆపై కుమారుడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి నిజాలేంటో నిగ్గు తేల్చారు.
 
వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్ జిల్లా పైఠణ్ తహసీల్ పరిధిలోని పైఠణ్‌ ఖేడ్ గ్రామంలో దేవిక ఇరాండే అనే మహిళకు ఓ కుమారుడు ఉండగా, మళ్లీ గర్భం దాల్చింది. ఈసారి తనకు కుమార్తె పుడుతుందని ఆమె అనుకుంది. కానీ కుమారుడే పుట్టడంతో నిరాశ చెందింది. బాలుడికి ప్రేమ్ పరమేశ్వర్ ఇరాండే అని పేరు పెట్టిన దేవిక, ఆమె భర్త, బిడ్డను పది నెలల పాటు పెంచారు.
 
ఇంతలో తన కుమారుడు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాగిలాల సాయంతో దేవిక ఇంటి వద్ద డ్రమ్ములోనే పిల్లాడి మృతదేహాన్ని కనుగొన్నారు. చివరకు కన్నబిడ్డను తల్లే చంపేసిందని విచారణలో వెల్లడి అయ్యింది. దీంతో దేవికను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments