మా భార్యలు తెగ తాగేస్తున్నారు... పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తలు!!

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (08:39 IST)
మా భార్యలు తెగ తాగేస్తున్నారంటూ పలువురు భర్తలు వాపోతున్నారు. ఇదే అంశంపై వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిసైన తమ ఆడవాళ్లు ఇంటిని గుల్ల చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని లబోదిబోమంటున్నారు. ఇది కాస్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది పచ్చి నిజం. ఒరిస్సా రాష్ట్రంలోని కోరాట్‌పుట్ జిల్లా బరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామంలోని పురుషులందరూ బుధవారం పోలీసులు, ఆబ్కారీ అధికారులను కలిసి తమ బాధను మొరపెట్టుకున్నారు. 
 
గ్రామంలోని కొందరు యువకులు సారా తయారు చేసి విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తాము కూలి చేసి డబ్బులు సంపాదించి తెస్తుంటే తమ భార్యలు మాత్రం మద్యానికి బానిసై ఇల్లు గుల్ల చేస్తున్నారని, డబ్బులు మొత్తం మద్యానికే ధారబోస్తున్నారని వాపోయారు. ఇలాగైతే సంసారాలు గడవడం కష్టమని, పిల్లలు బతుకు అంధకారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సారా తయారీదారులపై చర్యలు తీసుకుని తమ కుటుంబాలను, గ్రామాన్ని రక్షించాలని వేడుకున్నారు. వారి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు తగిన చర్యలకు సిద్ధమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments