Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలం పార్టీకి షాక్ : సీనియర్ నేత యశ్వంత్ సిన్హా గుడ్‌బై

భారతీయ జనతా పార్టీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తేరుకోలేని షాకిచ్చారు. కమలం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, తాను ఇకపై ఏ రాజకీయ పార్టీలో చేరబోనని స్పష్టంచేశారు.

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:17 IST)
భారతీయ జనతా పార్టీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తేరుకోలేని షాకిచ్చారు. కమలం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, తాను ఇకపై ఏ రాజకీయ పార్టీలో చేరబోనని స్పష్టంచేశారు.
 
వాస్తవానికి ఆయన గత కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ, 'బీజేపీతో అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్టు ఇదే వేదికగా ప్రకటిస్తున్నాను. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు.
 
ముఖ్యంగా, బడ్జెట్ మలివిడత సమావేశాల్లో భాగంగా, పార్లమెంట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కేంద్రం వైఖరే కారణం. ప్రధాని మోడీ కనీసం ఒక్కసారైనా ప్రతిపక్షాలను పిలిచి ఎందుకు చర్చించలేకపోయారంటూ ఆయన నిలదీశారు. 
 
కాగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలతో తాను సమావేశం నిర్వహించనున్నాననీ... ప్రత్యమ్నాయ రాజకీయ వేదిక కోసం చర్చిస్తానని ఆయన గురువారమే ప్రకటించారు. మరో బీజేపీ అసమ్మతి నేత శతృఘ్ను సిన్హాతో కలిసి 'రాష్ట్ర మంచ్' పేరుతో ఈ సమావేశం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments