Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి ఒకటవ రోజు....శైలిపుత్రిగా అమ్మవారు... ఎలా పూజించాలి?(వీడియో)

నవరాత్రి, దసరాతో పదిరోజుల పండుగ మనముందుకు వచ్చేస్తోంది. ఈ నెల (సెప్టెంబర్) 20వ తేదీ నుంచి 30వరకు నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగనున్నాయి. నవరాత్రుల్లో అమ్మవారిని నిష్టతో పూజిస్తే సకల సంపద

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (16:34 IST)
నవరాత్రి, దసరాతో పదిరోజుల పండుగ మనముందుకు వచ్చేస్తోంది. ఈ నెల (సెప్టెంబర్) 20వ తేదీ నుంచి 30వరకు నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగనున్నాయి. నవరాత్రుల్లో అమ్మవారిని నిష్టతో పూజిస్తే సకల సంపదలు, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. 
 
ఈ పూజ మొదటి రోజు శైల పుత్రి మాతతో ప్రారంభమై ఆఖరి రోజు సిద్ధిధాత్రి మాతతో ముగుస్తుంది. అందుకే తొలి రోజున శైలపుత్రిని పూజించాలి. ప్రతిపాద తిథి ప్రారంభం = సెప్టెంబర్ 20, రాత్రి 10.59 నుంచి సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 10.34 గంటల వరకు. సెప్టెంబర్ 21, చంద్రదర్శనం, నవరాత్రి ప్రారంభం, ఘంటాస్థపన ముహూర్తం ఉదయం 6.12 నుంచి 08.09 వరకు (నిడివి 1 గంటా 56 నిమిషాలు). 
 
నవరాత్రి ఆరంభం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అనే తిథి రెండు రకాలుగా వుంటుంది. శుద్ధ తిథి అంటే సూర్యోదయము నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు వుంటుంది. దీనిప్రకారం మొదటి రోజు సూర్యోదయానంతరం అమావాస్య కొన్ని ఘడియలుండి, అనంతరం పాడ్యమి ప్రారంభమై.. మరుసటి సూర్యోదయానికి ముందే పూర్తవుతుంది. అమావాస్యతో కూడిన పాడ్యమి నాటి నుంచి నవరాత్రులు ఆరంభించాలని పండితులు చెప్తున్నారు.
 
రాత్రిపూట, పగటి పూట ఘంటస్థాపన చేయకూడదు. నవదుర్గల అవతారాల్లో మొట్ట మొదట పూజలందుకునేది శైల పుత్రి మాత. శైల పుత్రి మాతని నవరాత్రుల ప్రారంభ రోజున బూడిద రంగు వస్త్రాలతో అలంకరించి మట్టి ఘటం మీద స్థాపిస్తారు. భక్తులు ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరించాలి.
 
తొలిరోజున శైలపుత్రిని 
వందే వాంచిత లాభాయ చంద్రార్థకృత శేఖరమ్ 
వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్ అనే మంత్రంతో స్తుతించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments