చేపల పకోడీలు తయారీ విధానం...

వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే దాంతో డ‌యాబెటిస్ దూరం అవుతుంది. ఇంకా గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింతే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్న

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (14:20 IST)
వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే దాంతో డ‌యాబెటిస్ దూరం అవుతుంది. గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింటే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి చేపలతో కూర, ఫ్రైలు కాకుండా పకోడీలు ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు - 2 కప్పులు
కోడిగుడ్లు -  3
కార్న్‌ఫ్లోర్ - 3 స్పూన్స్
కారం -  2 స్పూన్స్
కొత్తిమీర - 1 కప్పు
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత
నిమ్మరసం - 2 స్పూన్స్
 
తయారు చేసే విధానం :
ముందుగా కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలపాలి. ఆ మిశ్రమంలో శుభ్రం చేసి ఉంచిన చేప ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. చేప ముక్కలకు మసాలా బాగా అంటేలా చేసుకోవాలి. అర్థగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టేయాలి. ఆపై స్టౌ మీద బాణలిని పెట్టుకుని నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి దోరగా వేపుకోవాలి. అంతే... వేడి వేడి చేపల పకోడీలు రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Doomsday Fish: పాములా మిలమిల మెరిసే చేపలు.. సముద్రం నుంచి బయటికి.. అపశకునమా?

కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్మేశారు.. ఎక్కడ?

Medak: పుట్టిన వారం రోజులకే మగబిడ్డను అమ్మేశారు

ఇరాన్ కొత్త నేతతో సవాల్.. యుద్ధం నుంచి ట్రంప్ సలహాదారు ఎగ్జిట్ ప్లాన్

పని ఒత్తిడి భరించలేక... భాగ్యనగరిలో మహిళా టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun 23: అల్లు అర్జున్ 23 చిత్రం స్పెషల్ థీమ్ సాంగ్ ర్యాంపేజ్

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం

Mark K Robin: గద్దర్ పాటలు కాదు ఫైర్ - ఆయన పేరుతో అవార్డు రావడం ఆనందంగా వుంది : మార్క్ కె రాబిన్

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా హర్షిత్ రెడ్డి దీవాన మూవీ రిలీజ్

Poorna: పూర్ణ నటించిన అతీంద్రియ అంశాలతో కూడిన డార్క్ నైట్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments