Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండిట్ జస్‌రాజ్ ఇకలేరు.. రాష్ట్రపతి - మోడీ సంతాపం

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (22:52 IST)
పండిట్ జస్‌రాజ్ ఇకలేరు. హర్యానా రాష్ట్రంలో జన్మించిన ఆయన 90 యేళ్ళ వయసులో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో సోమవారం కన్నుమూశారు. శాస్త్రీయ సంగీతంలో దేశ, విదేశాల్లో ఖ్యాతి గడించిన ఆయన మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలు తీవ్ర సంతాపం తెలిపారు.
 
మ్యూజిక్ లెజెండ్ పండిట్ జస్‌రాజ్ మృతి తనను విషాదంలో ముంచెత్తిందని రాష్ట్రపతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 8 దశాబ్దాలకు పైగా అత్యద్భుతమైన కెరీర్ సాగించి సంగీత సామ్రాజాన్ని సుసంపన్నం చేసిన పద్మ విభూషణుడు జస్‌రాజ్ అని గుర్తుచేసుకున్నారు. జస్‌రాజ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
ఇకపోతే, పండిట్ జస్‌రాజ్ మృతి దురదృష్టకరమని, భారతీయ సాంస్కృతిక, సంగీత ప్రపంచానికి తీరని లోటని ప్రధాని నరేంద్ర మోడీ తన సంతాప సందేశంలో వ్యాఖ్యానించారు. జస్‌రాజ్ సంప్రదాయ రాగాలు ఎంతో ప్రాచుర్యం పొందడమేకాకుండా, ఆయన ఎందరికో సంగీతంలో శిక్షణ ఇచ్చారని గుర్తుచేశారు. పండిట్ జస్‌రాజ్ కుటుంబ సభ్యులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు మోడీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

తర్వాతి కథనం
Show comments