Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో శివమొగ్గ వాసి పంట పండింది.. రూ.24 కోట్ల బంపర్ లాటరీ!

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (11:13 IST)
ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన శివమొగ్గ వాసికి అదృష్టం కలిసివచ్చింది. దుబాయ్ ప్రభుత్వం నిర్వహించే లాటరీలో ఏకంగా రూ.24 కోట్ల బంపర్ లాటరీని గెలుచుకున్నాడు. ఈ అదృష్టవంతుడి పేరు శివమూర్తి కృష్ణప్ప. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతవాసి. 
 
ఈయన వృత్తిరీత్యా ఓ మెకానికల్ ఇంజినీరు. గత 15 ఏళ్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్నాడు. ఇటీవల కృష్ణప్ప కొనుగోలు చేసిన లాటరీ (నెంబరు 202511) టికెట్‌కు ప్రథమ బహుమతి లభించింది. ఈ టిక్కెట్‌ను గత నెల 17వ తేదీన కొనుగోలు చేశాడు. 
 
ఈ బహుమతి భారత కరెన్సీలో రూ.24 కోట్లకు పైగా ఉంటుందట. గత మూడేళ్లుగా ప్రతి నెలా లాటరీలు కొంటుంటే ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని కృష్ణప్ప పట్టరాని సంతోషంతో చెప్పాడు. 
 
కాగా, ఈసారి ఒకేసారి రెండు టికెట్లు కొనేందుకు నిర్వాహకులు అనుమతించడంతో తన అదృష్టం పండిందని తెలిపాడు. ఈ డబ్బుతో సొంతూర్లో ఓ ఇల్లు కట్టి, మిగతా డబ్బు పిల్లల చదువులు, వారి భవిష్యత్ కోసం దాచుకుంటానని ఆ ఇంజినీర్ వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

బీరు సేవిస్తూ డ్రైవ్ చేసిన వ్యక్తి : వీడియో వైరల్

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments