శనివారం శివుడిని ఇలా ప్రార్థిస్తే.. నల్ల నువ్వులు, నీళ్లు..?

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (05:00 IST)
శనివారం రోజున ఇలా శనీశ్వరుడిని పూజించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి. నల్ల నువ్వులు, నీళ్లు శివుడికి సమర్పించి.. ఓం నమః శివాయ అని జపించాలి. ఇలా చేయడం వలన శివుడు, శని ఇరువురు వారిని పూజించిన వారి సమస్యలను తొలగిస్తారని ప్రతీతి. అంతేకాకుండా శనిదేవుడి ముందు ఆవ నూనేతో దీపం వెలిగించి.. నల్ల నువ్వులతో దీపం వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది. 
 
అంతేకాకుండా నల్లని వస్త్రాలను ధానం చేయడంతో పాటు, నలుపు శునకాలకు ఆహారాన్ని అందించాలి. అలాగే ప్రతి శనివారం శని శాంతి మంత్ర స్తుతి అయిన క్రోడం నీలాంజన ప్రఖ్యం అనే మంత్రాన్ని 11సార్లు పఠిస్తే శనిబాధ నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే బియ్యం పిండి, పాలు, బెల్లం, అరటి పండు కలిపి ప్రమిదను తయారు చేయాలి. అందులో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి. 
 
శనివారం శివుడు, విష్ణువులకు ప్రీతికరమైన రోజు. అందుకే వేకువజామునే లేచి తులసి కోట ముందు ఆవు నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపం వెలిగించాలి. ఇలా చేసిన వారి ఇంట్లో శ్రీ లక్ష్మీ దేవి నిరంతరం కొలువుంటుందని విశ్వాసం. శనివారం రోజు శనిని పూజించే సమయంలో శివుడికి కూడా పూజ చేస్తే.. వారీ సమస్యలు తొలగి, కుటుంబం అకాల మరణం నుంచి విముక్తి పొందుతుంది అంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుట్టినరోజే మరణించాడు.. ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఆందోళన చేస్తాం : సీజీపీ

రెండోసారి కూడా ఆడబిడ్డ.. నీటి సంపులో పడేసి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

నీట్ వరుస లోపాలకు ముగింపు పలకాలి.. సుప్రీం కోర్టు ఆదేశాలు

ఇక ప్రశ్నపత్రాల లీకేజీ పాల్పడితే జీవితాంతం జైలే : చట్ట సవరణపై కేంద్రం దృష్టి

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Astrology: 24-07-2026 శుక్రవారం ఫలితాలు.. ఒత్తిడికి గురికావద్దు

TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్‌

తిరుమల 7వ మైలు వద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ.. అలా కనిపెట్టేశారు..

23-07-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

తర్వాతి కథనం
Show comments