Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 27న వటసావిత్రి వ్రతం చేస్తే.. సౌభాగ్యం...

ఈ వ్రతం జ్యేష్ఠ పూర్ణమనాడు ఆచరిస్తారు. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజునే ప్రదోషకాలంలో ఆరంభిస్తారు. కొందరు జ్యేష్ఠ అమావాస్యకు చేస్తారు. స్త్రీలు ఐదవతనాన్ని గొప్పవరంగా భావిస్తారు. ఐదవతనాన్ని కాపాడుకోవాడానికి

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (11:47 IST)
ఈ వ్రతం జ్యేష్ఠ పూర్ణమనాడు ఆచరిస్తారు. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజునే ప్రదోషకాలంలో ఆరంభిస్తారు. కొందరు జ్యేష్ఠ అమావాస్యకు చేస్తారు. స్త్రీలు ఐదవతనాన్ని గొప్పవరంగా భావిస్తారు. ఐదవతనాన్ని కాపాడుకోవాడానికి అనేక వ్రతాలు, పూజలు చేస్తారు. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వటసావిత్రి వ్రతం వంటివి విశేషమైనవి. వీటిలో వటసావిత్రి వ్రతానికో ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని వటవృక్షంతో పూజచేయడం మంచిది.
 
వటవృక్షం అనగా మర్రిచెట్టు. భారతీయుల జాతి వృక్షం. మర్రిచెట్టును త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు. మర్రిచెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు కొమ్మలు శివునికి నివాసస్థలాలు. ఈ వ్రతం రోజు సుమంగళులు వటవృక్షానికి పసుపు, కుంకుమలతో, అక్షతలతో పూజిస్తే మంచిది. వటవృక్షాన్ని పువ్వులతో అలంకరించి గాజులు మెుదలైన అలంకరణ సామాగ్రిని సమర్పించి ధూప, దీప, నైవేద్యాలతో పూజించాలి.
 
తరువాత వటవృక్షం చుట్టూ 108 సార్లు ప్రదక్షణలు చేస్తూ ముడిప్రత్తి నుండి వడికి తీసిన దారాన్ని వృక్షం చుట్టూ చుట్టుకుంటూ వెళ్ళాలి. వటవృక్షం యెుక్క దీర్ఘాయుర్దాయంతో తమ భర్తల ఆయుష్షును బంధించడమే ఇలా దారం చుట్టడంలోని అంతరార్థం. జనన మరణాలు కాలం మీద ఆధారపడి ఉంటాయి.

కాబట్టి కాలాన్ని బంధించే భావనతో ఇలా దారాన్ని చుట్టడం జరుగుతోందని కూడా అనుకోవచ్చును. పూజ పూర్తయ్యాక ప్రతి స్త్రీ, ఐదుగురు సుమంగళుల నొసటన బొట్టు పెట్టించుకోవాలి. సౌభాగ్యం, సంతానవృద్ధి, సిరిసంపదల కోసం వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎప్పట్లాగే మానవత్వం మరణించింది, మహిళా మృత కళేబరం నుంచి ఆభరణాలు వలుస్తున్న జనం, వీడియో

Delimitation Effect: అత్యాధునిక హంగులతో అమరావతికి అసెంబ్లీ భవనం

నేపాల్ మెరుపు వరదలు: ఆచూకి లేని ఐదుగురు ఆంధ్ర పర్యాటకులు

మొబైల్ ఫోన్ వాడకంపై తండ్రి మందలింపు: యువతి రైలుకింద పడి ఆత్మహత్య

గద్గద స్వరంతో కన్నీటి పర్యంతమవుతూ గల్లంతైనవారి వివరాలను వెల్లడించిన సద్గురు, మిన్నంటిన రోదనలు, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

రాఖీ పౌర్ణమి రోజున మూడు యోగాలు.. మేషరాశికి పట్టిందల్లా బంగారమే

శబరిమల ఆలయంలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు మెదడులో రక్తస్రావం

27-08-2026 రాశి ఫలితాలు, కీలక పత్రాలు అందుకుంటారు

కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?

26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి

తర్వాతి కథనం
Show comments