Webdunia - Bharat's app for daily news and videos

Install App

Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?

సెల్వి
సోమవారం, 2 జూన్ 2025 (19:37 IST)
భోజనం చేసిన తర్వాత చాలామంది కంచంలోనే చేతులు కడిగేస్తుంటారు చాలామంది. కొందరైతే తిన్న కంచంలో అన్నం వున్నా పట్టించుకోకుండా అందులోనే కడిగేయడం చేస్తుంటారు. 
 
పద్ధతిగా భోజనం చేయడం, ఆహారాన్ని మిగల్చకుండా చేయడం.. ఆపై తిన్న కంచాన్ని శుభ్రంగా కడిగిపెట్టడం చేయాలి. అలా చేయకుండా ఆధ్యాత్మికపరంగానూ, ఆరోగ్యపరంగానూ నష్టమేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అవును ఆహారం వడ్డించే పాత్రల్లో లక్ష్మీదేవి నివాసం వుంటుందని చెప్తారు. 
 
అందుచేత భోజనం చేసిన పాత్రల్లోనే చేతుల్ని కడిగితే అది అశుభ్రతకు సంకేతం. అశుభ్రత వున్నచోట లక్ష్మీదేవి వుండదు. అందుచేత తిన్న కంచంలోనే కడిగితే లక్ష్మీ కటాక్షం అంతంత మాత్రమే. 
 
అలాగే ఆహారం తీసుకునే ప్లేటులోనే కడగటం మంగళప్రదం కాదు. ఇది అన్నపూర్ణమ్మను అవమానించినట్లు అవుతుంది. అలాగే కంచంలోనే చేతులు కడిగే వ్యక్తిపై ప్రతికూల ప్రభావాలుంటాయి. ఇంకా పేదరికం, ఇతర రకాల దురదృష్టాలు సంభవించవచ్చు.
 
అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కంచంలోనే చేతులు కడగటం ద్వారా ఆ ఇంట ఆహార కొరత ఏర్పడే అవకాశం వుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆహారాన్ని మిగలపెట్టడం అశుభంగా పరిగణించబడుతుంది.
 
భోజనం చేసే ముందు దేవతలను ధ్యానించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆహారం తీసుకునేటప్పుడు పద్ధతిగా చాపపై కూర్చుని తీసుకోవాలి. ఆహారం తినేటప్పుడు, కోపం, సంభాషణ లేదా వింత శబ్దాలు చేయకూడదు. ప్రశాంతంగా భోజనం చేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

51వ సారి బెంగళూరుకి ఫ్లైట్ ఎక్కిన జగన్మోహన్ రెడ్డి.. అసెంబ్లీకి వస్తానని మాటిచ్చి?

ఉల్లి రైతులకు రూ.50,000 చెల్లించాలని నిర్ణయించిన ఏపీ సీఎం చంద్రబాబు

Udhampur Encounter: ఉధంపూర్‌లో ఉగ్రవాదులు- ఆ నలుగురిపై కాల్పులు- జవాను మృతి

ఆర్థిక ఇబ్బందులు.. కన్నబిడ్డతో పాటు చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

తెలంగాణలో భారీ వరదలు- వన దుర్గ భవాని ఆలయం మూసివేత

అన్నీ చూడండి

లేటెస్ట్

Pradosham: ప్రదోష సమయలో నరసింహ స్వామిని పూజించాలి.. ఎందుకంటే?

Aishwarya Pradosham: ఐశ్వర్య ప్రదోషం- నీలకంఠ స్తోత్రం పఠించడం చేస్తే?

19-09-2025 శుక్రవారం ఫలితాలు - రావలసిన ధనం అందుతుంది.. ఖర్చులు సామాన్యం...

18-09-2025 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య ఏకాగ్రత నెలకొంటుంది...

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించనున్న ఇస్రో.. 1000 ఆలయాల నిర్మాణం

తర్వాతి కథనం
Show comments