ఆ కొలనులో గాజులు ధరించిన చేయి అటూఇటూ ఊగుతూ కనిపించింది... ఆమె ఎవరో తెలుసా?

Webdunia
సోమవారం, 29 జులై 2019 (17:46 IST)
4
తపోశక్తితో నారాయణుని పుత్రుడుగా పొందవచ్చు. అలాగే సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవిని కుమార్తెగా కూడా పొందవచ్చు. ఇలాంటి నిదర్శనానికి ఉదాహరణే ఇది. కామార్ప్‌కూర్ వెళ్ళే దారిలో రహదారి ప్రక్కన రంజిత్ రాయ్ కు చెందిన పెద్దకొలను ఒకటి ఉంది. రంజిత్ రాయ్ ఇంట్లో జగజ్జనని అతని కుమార్తెగా జన్మించింది. ఆమె గౌరవార్ధం ఇప్పుడు కూడా అక్కడ చైత్ర మాసంలో జాతర జరుగుతుంది. ఆమె జగజ్జననిగా ఎలా మారిందో తెలుసుకుందాం.
 
రంజిత్ రాయ్ అక్కడ జమిందార్. తపోశక్తి ద్వారా జగజ్జననిని కుమార్తెగా పొందాడు. కుమార్తె అంటే అతనికి ఎంతో అనురాగం. ఆమె కూడా ఎప్పుడూ తండ్రిని అంటిపెట్టుకొని ఉండేది. అతనిని వదిలేదికాదు. ఒకరోజు రంజిత్ రాయ్ తన జమీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి పసిపిల్లలకు సహజమైన స్వభావంతో, నాన్నగారు అదేమిటి, ఇదేమిటి అని అంటూ విసిగిస్తుంది. రంజిత్ రాయ్ మంచి మాటలతో ఆమెకు నచ్చజెప్పాలని చూశాడు. ఆమెతో అమ్మ ప్రస్తుతం నీవు వెళ్లు. నాకెన్నో పనులున్నాయి అన్నాడు.
 
కాని ఆ అమ్మాయి వదలడం లేదు. చివరకు రంజిత్ రాయ్ అన్యమనస్కంగా నీవు ఇక్కడ నుంచి వెళ్లిపో అనేశాడు. అదే సాకుతో ఆమె ఇంటిని వదిలి పెట్టి వెళ్లిపోయింది. ఆ సమయంలో గాజులు అమ్మేవాడొకడు దారిలో పోతున్నాడు. ఆ అమ్మాయి అతనివద్ద కొన్ని గాజులు తీసుకొని ధరించింది. డబ్బు అడిగేసరికి, ఇంట్లో ఫలానా పెట్లో డబ్బులున్నాయి అని చెప్పి ఆమె అక్కడనుంచి వెళ్లిపోయింది. గాజులు అమ్మేవాడు రంజిత్ రాయ్ ఇంటికి వచ్చి గాజులకు డబ్బులు ఇవ్వమన్నాడు. 
 
అమ్మాయి ఇంట్లో కనిపించకపోయేసరికి వాళ్లు గాబరా పడి నాలుగువైపులా వెతకనారంభించారు. గాజులు అమ్మేవాడికి ఇవ్వవలసిన డబ్బు ఆ అమ్మాయి చెప్పినట్లు పెట్టెలో ఉంది. రంజిత్ రాయ్ భోరున విలపించసాగాడు. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి కొలనులో ఏదో కనిపిస్తుంది అని చెప్పాడు. అందరూ కొలను వద్దకు వెళ్లి చూసేసరికి గాజులు ధరించిన చేయి ఒకటి నీటిపైన అటూ ఇటూ ఊగుతూ కనిపిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత మరేమి కన్పించలేదు. ఇప్పుడు కూడా అక్కడ ప్రజలు జాతర నాడు ఆమెను జగజ్జననిగా ఆరాధిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

Himanshu post: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణ.. అయినా రిలాక్స్‌గా కేసీఆర్

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

తర్వాతి కథనం
Show comments